రాయదుర్గం-ఉరవకొండ బస్సు సర్వీసులు ప్రారంభం

On
రాయదుర్గం-ఉరవకొండ బస్సు సర్వీసులు ప్రారంభం

 మనస్సాక్షి, కణేకల్లు: కణేకల్లు-మాల్యం గ్రామాల మధ్య వేదవతి నదిలో కొట్టుకుపోయిన రోడ్డుకు మరమ్మతులు చేసినందుకు రాయదుర్గం నుంచి ఉరవకొండకు బస్సు సర్వీసులు ప్రారంభించారు. వేదావతి నదిలో వేసిన మట్టి రోడ్డు కొన్ని నెలల క్రితం వరద ప్రవాహానికి కొట్టుకుపోవడంతో కణేకల్లు మీదుగా ఉరవకొండకు వెళ్లాల్సిన బస్సు సర్వీసులు కణేకల్లు వరకే పరిమితమైయ్యాయి. ఉరవకొండ డిపోకు చెందిన బస్సులు కణేకల్లు మీదుగా రాయదుర్గం వెళ్లాల్సి ఉండగా మాల్యం వరకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సరైన రోడ్డు మార్గం లేక ప్రజలు పడుతున్న కష్టాలను గ్రామస్తులు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు దృష్టికి తెచ్చారు. ఎమ్మెల్యే స్పందించి కణేకల్లు మండల టీడీపీ నాయకులకు రోడ్డుకు మరమ్మతులకు ఆదేశించారు. టీడీపీ నాయకులు సొంత నిధులతో చేపట్టిన రోడ్డు మరమ్మతు పనులు పూర్తి కావడంతో ఆదివారం నుంచి బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులకు ప్రయాణికులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

Manassakshi Epaper
Views:117

About The Author

Related Posts

Latest News

పారిశుద్ధ్య కార్మికులకు నెలకోసారి హెల్త్‌ క్యాంప్‌ పారిశుద్ధ్య కార్మికులకు నెలకోసారి హెల్త్‌ క్యాంప్‌
మనస్సాక్షి, అనంతపురం : పారిశుద్ధ్య కార్మికులకు నెలకు ఒకసారి హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదేశించారు. కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా హెల్త్‌...
సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రతిమ ధర్మరాజ్‌కు సన్మానం
ఈవో చంద్రశేఖర్‌ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి 
లక్ష్మీపురంలో వాల్మీకి విగ్రహావిష్కరణ
గల్లంతైన వ్యక్తి శవమై తేలాడు..!
రూ.48 కోట్లతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ
అనంతలో మద్యం లాటరీకి భారీ బందోబస్తు