కణేకల్లులో వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు

On
కణేకల్లులో వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు

మనస్సాక్షి, కణేకల్లు: కణేకల్లులోని షిరిడీ సాయిబాబా ఆలయంలో ఆదివారం గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేకువజామున ఆలయ అర్చకులు గణపతి హోమం, శివ సాయి విగ్రహభిషేకం, మహా మంగళహారతులు తదితర ప్రత్యేక పూజలు నిర్వహించి అలంకరణ చేశారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. షిరిడి సాయిబాబాను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పార్టీ శ్రేణులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని షిరిడిసాయిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. సాయినాథుని దర్శనానికి వచ్చిన ఎమ్మేల్యే కాలవ శ్రీనివాసులు కు ఆలయ నిర్వాహకులు ఘనస్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.  దర్శనానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ  ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు, అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మేల్యే చేతుల మీదుగా భక్తులకు భోజనాలు వడ్డింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురు పౌర్ణమి సందర్భంగా చెక్కభజన చేసిన వారికి ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు.

WhatsApp Image 2024-07-21 at 9.09.32 PM

WhatsApp Image 2024-07-21 at 9.09.44 PM

Manassakshi Epaper
Views:139

About The Author

Related Posts

Latest News

పారిశుద్ధ్య కార్మికులకు నెలకోసారి హెల్త్‌ క్యాంప్‌ పారిశుద్ధ్య కార్మికులకు నెలకోసారి హెల్త్‌ క్యాంప్‌
మనస్సాక్షి, అనంతపురం : పారిశుద్ధ్య కార్మికులకు నెలకు ఒకసారి హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదేశించారు. కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా హెల్త్‌...
సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రతిమ ధర్మరాజ్‌కు సన్మానం
ఈవో చంద్రశేఖర్‌ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి 
లక్ష్మీపురంలో వాల్మీకి విగ్రహావిష్కరణ
గల్లంతైన వ్యక్తి శవమై తేలాడు..!
రూ.48 కోట్లతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ
అనంతలో మద్యం లాటరీకి భారీ బందోబస్తు